My friend

Wednesday, February 2, 2011

కాలయాపనే కాంగ్రెస్ లక్ష్యం


తెలంగాణ రాష్ట్రం ప్రకటించినట్టే చేసి వెన్ను చూపిన కాంగ్రెస్... పార్టీల మధ్య చీలికలు వచ్చినయని చెప్పి కమిటి యేసింది. అది అయిపొంగానే అఖిలపక్షం అనుకుంట పొద్దుపుచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఇదంతటితోటి వచ్చిన లాభం కానీ మార్పు కానీ ఏమి ఉండదని కాంగ్రెస్కు తెలుసు.... అయినా కాలం ఎల్లదీసే దోరనితోటి వ్యవహరించడంలో మతలబు వొక్కటే..... ఎలెక్షన్ దాక చూద్దాం. అంతదాకా మిగత పార్టీల పనిపడదాం టైముకు ఏదో ఒకటి చేద్దాంలే అనే చూస్తంది. మన చాతగాని చవట, దద్దమలు అమ్మగారు అనుకుంట ఇట్లానే చూస్తుంటారు. ప్రజల మనోభావాలతో ఆడుకుంటారు. అంతులేని ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నావారికి పట్టదు. ఇంకా రచ్చ బండ అనుకుంట వూర్లు తిరుగుతున్నారు. రొచ్చుబండ, రోకలిబండలు వద్దని ఆందోళన చేస్తున్నా దున్నపోతుమీద సినుకు పడ్డట్టే... పైనుంచి బెదిరిచ్చుడు. హైదరాబాద్ల పులిలాగా డిల్లిల పిల్లిలాగా మాట్లాడే వీళ్ళా మనల్ని ఉద్దరిచ్చే నాయకులు. ఇంకా తెలుగుదేసమోళ్ళు రాయలసీమ శాసనాలు చెల్లవంటూ వాళ్ళ సంకల్నే కూసుంటారు. గట్టిగ జై తెలంగాణ అననోల్లు కూడా తెలంగాణ కోసం పోరాడుతార. రాజీనామా చెయ్యమంటే కాంగ్రెస్ భూచి చూపెట్టి పొద్దు ఎల్లదీసే పిరికి పందేలు వీల్లతోటి ఏమైతది లండూకో బొండుకో టీఆర్ఎస్సే బండిని ముందుకు లాగాలే వాళ్ళ మీద జనాలు ఒత్తిడి పెంచితే... వాళ్ళు యుపియె మీద ఒత్తిడి పెంచుతారు. లేదంటే తెలంగాణ లేనట్టే

No comments: